గుజరాత్ కోర్టుకు ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు..

గుజరాత్ కోర్టుకు ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు..

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అజ్గర్‌ అలీ గత నెలలో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు నుంచే మళ్లీ నేరాల బాట పట్టాడు.జైలు నుంచి బయటకు వచ్చిరాగానే సెటిల్మెంట్లు మొదలుపెట్టడంతో పాటు ప్రణయ్ హత్యలో ఒప్పందం ప్రకారం రావాల్సిన డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తానంటూ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీ, అమృత తండ్రి మారుతీరావులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది.కాగా గతంలో గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యను హత్య చేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అజ్గర్‌ అలీకి జీవితఖైదు విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.దీంతో అప్పటి నుంచి అజ్గర్‌ అలీపై కన్నేసిన నిఘావర్గాలు, జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల నల్గొండలో ఒక స్థలానికి సంబంధించిన సెటిల్మెంట్ చేస్తూ అడ్డంగా దొరికాడు.20 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న ఆయా సంస్థలు విచారణ చేపట్టాయి.అయితే హరేన్ పాండ్యా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అస్గర్ అలీని గుజరాత్పోలీసులకు అప్పగించాల్సిందిగా అహ్మదాబాద్ కోర్ట్ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అతనిని గుజరాత్ తీసుకెళ్లిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos