విపణులు నష్టాల పాలు

విపణులు నష్టాల పాలు

ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం శుక్రవారం డోలాయమానంతో ఆరంభమయ్యాయి. ఉదయం 9.39 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో 28,099 వద్ద ,నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 8,212 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.79 కి దాఖలైంది. మదుపర్లు అయిన కాడికి తమ షేర్లను అమ్మేస్తుండటం ఇందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీసీ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్ని గడించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos