లంకలో ముస్లిం మంత్రులు రాజీనామా

లంకలో ముస్లిం మంత్రులు రాజీనామా

కొలంబో:శ్రీ లంకలో ఈస్టర్ పండుగ వేళ సంభవించిన ఆత్మాహుతి దాడుల ముస్లింలే కారణమని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగినందుకు నిరసనగా తొమ్మిది మంది ముస్లిం మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో న‌లుగురు క్యాబినెట్ హోదా కలిగిన వారు. మరో ఇద్దరు గవర్నర్లు పదవులకు రాజీనామా చేసారు.తూర్పు, పశ్చిమ ప్రాంతాల గ‌వ‌ర్న‌ర్లు హిజ్‌ బుల్లా, ఆజాత్ స‌ల్లేలు తమ పదవులకు రాజీనామా చేసారు. దేశంలో ముస్లింలను చేయని తప్పుకు హింసిస్తున్నారని ముస్లిం నేత‌లు ఆరోపించారు. ముస్లిం మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేస్తూ, ప్ర‌ఖ్యాత బౌద్ధ ఆల‌యం ముందు పార్లమెంటు సభ్యుడు అతుర‌లియే చేస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos