దుబాయ్ : చైనామన్
బౌలర్ కుల్దీప్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదే
అతని కెరీర్ బెస్ట్ ర్యాంకు. న్యూజిలాండ్తో కేవలం చివరి టీ20 మ్యాచ్లో మాత్రమే
ఆడిన కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగతా భారత్ బౌలర్లను న్యూజిలాండ్
బ్యాట్స్ మెన్ చీల్చి చెండాడినా కుల్దీప్ కేవలం 26 పరుగులిచ్చి రెండు వికెట్లు
తీసుకున్నాడు. దీని వల్ల అతని ర్యాంకింగ్ మరింతగా మెరుగుపడి అత్యుత్తమ స్థానానికి
చేరుకున్నాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(793
రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలవగా, శిఖర్ ధావన్ 11వ స్థానంలో ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్లో భారత జట్టు రెండు పాయింట్లు కోల్పోయినప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలి స్థానంలో పాకిస్తాన్ ఉంది.