హుజుర్ నగర్ ఉప ఎన్నిక బరిలో కోదండరాం?

హుజుర్ నగర్  ఉప ఎన్నిక బరిలో కోదండరాం?

ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలిచిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇకపై ఎంపీగానే కొనసాగడానికి నిర్ణయించుకోవడంతో హుజుర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయ్యే హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి ఇప్పటికే తీవ్రమైన పోటీ నెలకొంది.మరోవైపు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతిని హుజుర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించడానికి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఇదే హుజుర్ నగర్ ఉప ఎన్నిక బరిలో తేజసా నుంచి కోదండరాం బరిలో దిగడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం . హుజూర్ నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను పోటీకి దించాలని టీజెఎస్ భావిస్తోంది.గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా పోటీకి దిగాయి. హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఈ నెల 3న రాజీనామా చేయనున్నారు.ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి శానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దించడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఎన్నికల్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయార. ఉప ఎన్నికల్లో సైదిరెడ్డికే టికెట్ ఇచ్చి గెలిపించుకుని తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos