కేసీఆర్‌పై కేసు పెట్టాలి…

కేసీఆర్‌పై కేసు పెట్టాలి…

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెరాస ప్రభంజనానికి ఘోర ఓటమి చవిచూడడంతో
కాంగ్రెస్‌,బీజేపీ నేతల్లో కొద్ది రోజుల వరకు నైరాశ్యత ఆవరించింది.లోక్‌సభ ఎన్నికలు
సమీపిస్తుండడంతో ఇప్పుడిప్పుడు నిరాశ,నిస్పృహల నుంచి కోలుకుంటున్న రెండు పార్టీల నేతలు
గులాబి బాస్‌పై విమర్శల జోరు పెంచడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో మంత్రివర్గ
విస్తరణ కాంగ్రెస్‌,బీజేపీ నేతలకు ఆవకాశంగా లభించింది.తాజా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో
మహిళలకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడంతో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే
జి.కిషన్ రెడ్డి కెసిఆర్ పై ఆసక్తికర దాడికి దిగారు. ఉన్న పళంగా సీఎం కేసీఆర్ పై కేసు
నమోదు చేయాలని, అది కూడా మహిళల రక్షణ కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
షీ టీమ్స్ ఈ బాధ్యత తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక
మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని కేసీఆర్‌ రెండోసారి కూడా మహిళలను నిర్లక్ష్యం
చేసారంటూ ఆరోపించారు.మహిళలతో పాటు గిరిజనులకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించకుండా
కేసీఆర్‌ తన నైజాన్ని రుజువు చేసుకున్నారంటూ ఆరోపించారు.మహిళలపై ఆంక్షలు విధించే అరబ్‌
దేశాలు ఇప్పుడిప్పుడే మారుతుంటే కేసీఆర్‌ మాత్రం మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా
మహిళపట్ల అరబ్‌ దేశాల పాలన అవలంబిస్తున్నారని విమర్శించారు. కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆశ్చర్యకరంగానే ఉన్నా వాస్తవికంగా ఉండడం కొసమెరుపు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos