అన్యాయంగా చంపేశారట..

అన్యాయంగా చంపేశారట..

దిశ హత్యాచార ఘటన అనంతరం తమ పిల్లలను కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రగల్బాలు పలికిన ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు నిందితులు తల్లితండ్రులు,కుటుంబ సభ్యులు ఎన్‌కౌంటర్‌ అనంతరం ఒక్కసారి మాట మార్చేశారు. ఎన్ కౌంటర్ లో మరణించిన మహ్మద్ ఆరిఫ్ జొల్లు శివ జొల్లు నవీన్ చెన్నకేశవుల కుటుంబాలు మాత్రం అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తున్నాయి. తమ బిడ్డలను కావాలనే పోలీసులు హతమార్చారని నిందితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.తమ కొడుకులను కావాలనే చంపేశారని.. దాన్ని దాచిపెడుతూ ఎన్ కౌంటర్ జరిగిందని అబద్ధాలు ఆడుతున్నారని వాపోయారు. నిందితులకు శిక్షలు వేయడానికి కోర్టులు ఉన్నాయని.. ఇలా పోలీసులే అన్యాయంగా చంపేస్తే న్యాయం ఎక్కడ అని వారు ప్రశ్నించారు.ఇక ఎన్‌కౌంటర్‌పై నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య లక్ష్మీ సైతం ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పని కోర్టు తీర్పు ఇవ్వకముందే చంపేశారని మాట మార్చింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos