రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం  ప్రారంభమయ్యాయి. సరిగ్గా 12.12 గంటల వేళలో కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. జవాన్ల వీర మరణానికి సభ రెండు నిమిషాల మౌనం పాటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017
కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

ఓటాన్‌ అకౌంట్‌
బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలను పరిశీలిస్తే…

  • తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. వ్యవసాయ రంగంలో అడ్డంకులను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ రైతుల్లో నైరాశ్యాన్ని తొలగిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
  • 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది. పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వితంతువులు.. ఒంటరి మహిళలు – బీడీ కార్మికలు – బోధకాలు వ్యాధిగ్రస్తులు – నేత – గీత కార్మికులు – ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని – రూ.1000 నుంచి రూ.2116కు పెంచుతున్నాం.దివ్యాంగుల పింఛనును రూ.2000 నుంచి రూ.3116కు పెంచుతున్నాం.  వృద్ధాప్య పింఛన్ కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి – పెంచిన పింఛను అందిస్తాం
  • దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో మనరాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణం..
  • ఏప్రిల్ చివరి నాటికి మిషన్ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం. మరో రెండు నెలల్లో ఇంటింటింకి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తాం నిరుపేదలకు గృహ నిర్మాణపథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
  • ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్ లో రూ.12067కోట్లు కేటాయిస్తున్నాం.
    –  2019-20 సంవత్సారానికి మొత్తం బడ్జెట్ రూ.182017కోట్లు
    –  రెవెన్యూ వ్యయం రూ.131629కోట్లు
    –  మూలధన వ్యయం రూ.32815కోట్లు
    –  రెవెన్యూ మిగులు రూ.6564కోట్లు
    –  కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాలకు రూ.1450కోట్లు.
    –  నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
    –  ఎస్సీల ప్రగతి కోసం రూ.16581కోట్లు
    –  ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9827కోట్లు
    –  మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
    –  రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు
    –  బియ్యం రాయితీకి రూ.2774కోట్లు
    –  రైతు బీమా కోసం రూ.650కోట్లు
    –  రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందుకు రూ.12వేల కోట్లు
    –  వ్యవసాయశాఖకు రూ.20107కోట్లు.
    –  ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు
    –  నీటిపారుదలశాఖకు రూ.22500కోట్లు
    –  ఈఎన్ టీ – దంత పరీక్షలు రూ.5536కోట్లు
    –  పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ.3256కోట్లు
    –  ఒక్కో మనిషికి రూ.1606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
    –  500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
    –  వైద్య ఆరోగ్యశాఖకు రూ.5536కోట్లు
    –  బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటు.

తెలంగాణ తొలి బ‌డ్జెట్ స‌మావేశాలు వాడి వేడిగా సాగ‌నున్నాయి.
ఏదో మొక్కుబ‌డిగా కాకుండా ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్క‌రం దిశ‌గా స‌మావేశాలు ముందుకెళ్తే
శ్రేయ‌స్క‌రంగా ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు
అదికార గులాబీ పార్టీ ఇచ్చిన హామీల అమ‌లు ప‌ట్ల కూడా శాస‌న స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని
కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. సంక్షేమ ప‌థ‌కాలు పెద్ద‌ఎత్తున అమ‌లు చేస్తున్నామ‌ని చెప్తున్న
టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల ప‌ట్ల స‌మ‌గ్ర చ‌ర్చ జ‌రిపితే క్షేత్ర స్థాయిలో ఏం జ‌రుగుతుందో
తెలుస్తుంద‌ని కాంగ్రెస్ అంటోంది. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలను కనీసం పది రోజులైనా
నిర్వహించాలని సీఎల్పీ కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos