చంద్రబాబు నిర్ణయంపై కాపు నేతల హర్షం..

చంద్రబాబు నిర్ణయంపై కాపు నేతల హర్షం..

విజయవాడ: రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కేటాయిస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాపునేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాపు కోటా రిజర్వేషన్లను కేంద్రం పట్టించుకోకున్నా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు ఏర్పాటు చేశారన్నారు. దీంతో ఎంతో మంది కాపు సోదరులు లబ్ది పొందారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా నెలకొన్న సమస్యను చంద్రబాబు పరిష్కరించారని సుబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos