విజయవాడ: సీఎం చంద్రబాబు అగ్రవర్ణాలమధ్య చిచ్చుపెట్టి పబ్బంగడుపుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనిరాయణ ఆరోపించారు. మరోసారి టీడీపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజల ధన, మాన ప్రాణాలకు ప్రమాదమన్నారు. ఇక చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఒకవేళ చంద్రబాబును నమ్మితే వారిని దేవుడు కూడా కాపాడేపరిస్థితి లేదన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కన్నా విజ్ఞప్తి చేశారు.