విల్మింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం దాదాపు ఖరారయిపోయింది. శనివారం ఇక్కడ కమలా హారిస్ తో కలసి విలేఖరులతో మాట్లాడారు. ‘యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమే . అధ్యక్షుడిగా నా బాధ్యత . ఇప్పుడు అందరూ కోపతాపాలను పక్కన పెట్టాలి. ఒక దేశంగా ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిన తరుణం ఆసన్నమైంది. అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తొలి రోజునే కరోనా వైరస్ ను కట్టడి కార్యచరణ పథకాన్ని అమలు చేస్తాం. మహమ్మారి వల్ల పోయిన ప్రాణాలను తీసుకురాలేం. కానీ రాబోయే నెల చాలా మంది ప్రాణాల్ని కాపాడగలుగుతామ’న్నారు.