బద్వేలు : విధానసభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయదలచినట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సమితి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడిం చారు. “బద్వేలు ఉప ఎన్నికలో మేం అభ్యర్థిని నిలపడంలేదు. సిద్ధాంతపరమైన నిర్ణయం ఇది. మా పార్టీ అధ్యక్షుడు దీనిపై స్పష్టంగా చెప్పారు. అయితే, మా మిత్ర పక్షం బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి ప్రచారంలో పాల్గొనడం మా ధర్మం. తప్పకుండా మద్దతిస్తాం” అని నాదెండ్ల వివరణ ఇచ్చారు.