అనంతపురం : రాబోయే
ఎన్నికల్లో ఏ పార్టీ వారు డబ్బులిచ్చినా తీసుకుని, ఓటు మాత్రం వైకాపాకు వేయాలని ఆ
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓటర్లను కోరారు. రాప్తాడు సమీపంలో సోమవారం
నిర్వహించిన సమర శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక
హోదా విషయంలో నాలుగేళ్లు కిమ్మనకుండా ఉండిపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీక్షలు
చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే వైకాపా సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, 59 లక్షలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వైకాపా కార్యకర్తలపై 1,280 తప్పుడు కేసులు పెట్టారని, వైకాపా ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులను ఎత్తివేస్తామని ఆయన చెప్పారు.