రెండేళ్లుగా
సినిమాలకు దూరంగా ఉంటున్న అందాల తార శృతి హాసన్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో చేసిన
పోస్ట్ తెగ వైరల్గా మారింది.నా విషయంలో చాలా కాలంగా అనుకుంటున్న మంచిపని జరిగిపోయిందని
నేను ఇపుడు చాలా సంతోషంగా ఉన్నానని దేవుడి దీవెనులు నాపై కురిశాయని అదృష్టం వెంటాడుతోందంటూ
చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా సినీ వర్గాల్లో,శృతి అభిమానుల్లో
పలు అనుమానాలకు తావిస్తోంది.కొద్ది కాలంగా లండన్ దేశానికి చెందిన మైఖెల్ కోర్సలేతో
శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్లే
చాలా సార్లు శృతి,మైఖేల్లు చెట్టపట్టాలేసుకొని తెగ తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.మైఖేల్
కారణంగానే రెండేళ్లుగా శృతి సినిమాలకు దూరంగా ఉంటోంది.ఈ తరుణంలో శృతిహాసన్ తాజాగా
చేసిన పోస్ట్,కొద్ది రోజులుగా శృతి పలు చిత్రాలకు సంబంధించి స్క్రిప్ట్లు పరిశీలిస్తుండడం
ఇవన్నీ మైఖేల్తో బ్రేకప్ అయి ఉంటుందని జోరుగా చర్చలు జరుగుతున్నాయి..