అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫోన్ చేశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇప్పటికే జగన్ పలువురు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా జగన్ కోరారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జగన్ 30న మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.