అమరావతి : పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు ముసాయిదాల గురించి మధ్యంతర ఉత్వర్వుల జారీకి ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయిల ధర్మాసనం గురువారం తిరస్కరించింది.వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న కక్షిదారు వాదననను నిరాక రించింది. సంబంధిత ముసాయి దాలపై చట్టసభల్లో ఇంకా చర్చ కొనసాగుతున్నందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.