ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరి పోరు

ఢిల్లీలో కాంగ్రెస్  ఒంటరి పోరు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పొసగక పోవటంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా తలపడనుంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను బరిలోకి దించనుంది.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీకి దిగారు. చాందినీ చౌక్‌ నుంచి జేపీ అగర్వాల్‌, తూర్పు ఢిల్లీ నుంచి అరవిందర్‌ లవ్లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్‌ మాకెన్‌, రాజేష్‌ లిలోతియా వాయువ్య ఢిల్లీ, మహబ్‌లాల్‌ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్‌ ప్రకటించింది.భాజపాను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. ఢిల్లీలో నాలుగు లోక్సభ కేటాయించినా పొత్తుకు ఆప్‌ విముఖత చూపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేసారు. ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరేలా కాంగ్రెస్‌ వైఖరి ఉందని ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos