అచ్చెట్టిపల్లి పంచాయితీ అధ్యక్షుని ఔదార్యం

అచ్చెట్టిపల్లి పంచాయితీ అధ్యక్షుని ఔదార్యం

హోసూరు : హోసూరులో వికలాంగులకు అచ్చెట్టిపల్లి పంచాయితీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక కామరాజ్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 50 మంది వికలాంగులకు ని త్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హోసూరు పట్టణంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాలలో కూడా పేదలకు, వికలాంగులకు కూడా నిత్యావసర వస్తువులను పంచిపెట్టానని వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఆయన పంచిపెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos