కరోనా కు గో మూత్రం విరుగుడు

కరోనా కు గో మూత్రం విరుగుడు

కోల్కతా : కరోనా కు గో మూత్రం విరుగుడని పశ్చిమ బంగ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శనివారం దుర్గాపూర్ నగరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సెలవిచ్చారు. ‘నేను ఆవుల గురించి మాట్లాడితే చాలా మందికి అసౌకర్యం అనిపిస్తుంది. ఆవు విలువను గాడిదలు ఎప్పటికీ అర్థం చేసుకోవు. ఇది భారతదేశం, శ్రీకృష్ణుడు జన్మించిన భూమి ఇక్కడ మేం ఆవులను పూజిస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి మాకు ఆవు మూత్రం ఉంది. మద్యం తాగే వారు, ఆవు విలువను ఎలా అర్థం చేసుకుంటార’ని వీడియోలో పేర్కొన్నారు. 2019 నవంబరులో ఘోష్ ఆవు పాలలో బంగారం ఉందని విశ్లేషించి అబాసు పాలయ్యారు. గత మే నెల్లో ఆవు మూత్రాన్ని తాగడం వల్ల ఎటు వంటి హానీ ఉండదని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos