అహ్మదాబాద్: గుజరాత్లో కూడా భాజప ఆపరేషన్ కమలకు పదును పెట్టటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ విలాస విడిది రాజకీయాలకు తెర తీసింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియటంతో మిగిలిన అరవై మంది శాసనసభ్యులు చేజారి పోకుండా కాపాడుకునేందుకు శనివారం ఉదయం వారిని విలాస విడుదులకు తరలించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు రాజీనామా చేశారు.గత మార్చిలో ఐదు గురు కమలం బావుటాను చేత బట్టారు.