ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పుంజుకున్నాయి. ఉదయం 9.55 గంటల వేళలో సెన్సెక్స్ 159 పాయింట్లు లాభ పడి 42,032 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు ఎగబాకి 12,380 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.71 గా దాఖలైంది. యస్ బ్యాంక్, హెచ్యూఎల్, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్ని గడించాయి. వేదాంత, ఎ న్టీ పీ సీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్ట పోయాయి.