ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9.50 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 171 పాయింట్లు లాభపడి 40,411 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,903 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.70.96 వద్ద దాఖలైంది. భారతీ ఇన్ఫ్రాటెల్, గెయిల్, టీసీఎస్, టెక్ మహీం ద్రా, కోల్ ఇండియా షేర్లు లాభాల్ని గడించాయి. యస్ బ్యాంక్, హీరోమోటార్కార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హె చ్యూఎల్ షేర్లు నష్ట పోయాయి. యస్ బ్యాంక్ షేర్లు ఒక దశలో ఆరు శాతం మేర నష్టపోయింది.