హైదరాబాద్ : ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల అంతిమ సంస్కారాలు శుక్రవారం ఇక్కడ ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అంతకు మునుపు నానక్రామ్గూడలోని కృష్ణ నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో ఉన్న విజయ కృష్ణ గార్డెన్స్ వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. అభిమానులు భారీగా తరలి వచ్చారు. కుమారుడు నరేష్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అనారోగ్యంతో గురువారం ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే.