దిశను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి సజీవదహనం చేసిన నిందితులను పోలీసులు దిశను దహనం చేసిన చోటే ఎన్కౌంటర్ చేయడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది.నిందితులను ఎన్కౌంటర్ చేసి దిశకు న్యాయం చేసిన పోలీసులపై అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు పోలీస్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు.ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేస్తూ మహిళ సంఘాలు పోలీసులను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం మీదుగా బస్సులో కళాశాలకు వెళుతున్న అమ్మాయిలు ఎన్ కౌంటర్లో దిశను చంపేసిన వారంతా మరణించారని తెలుసుకున్న అమ్మాయిలు, తమలోని ఆనందాన్ని కేకలు, కేరింతలతో బయటకు చూపించారు.మరోవైపు నగరంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు,ప్రజలు ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి,స్వీట్లు పంచుకోవడం గమనార్హం..
#WATCH Hyderabad: Reaction of girl students when news of encounter of the accused in murder and rape of woman veterinarian broke out pic.twitter.com/z238VVDsiC
— ANI (@ANI) December 6, 2019