కొద్ది రోజుల క్రితం తెరాస పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం కమలం గూటికి చేరారు.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీణ్తో కలసి శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సమక్షంలో బీజేపీలె చేరారు. న్యూఢిల్లీలో రాం మాధవ్తో తొలుత వివేక్ సమావేశమయ్యారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వివేక్ భేటీ అయ్యారు.ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో వివేక్ సమావేశమయ్యారు.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించగా అందుకు తెరాస అధినేత కేసీఆర్ నిరాకరించడంతో మనస్తాపం చెందిన వివేక్ పార్టీకీ రాజీనామా చేశారు.రాజీనామా అనంతరం వివేక్ కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు వినిపించాయి.తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సైతం వివేక్తో మంతనాలు జరపడంతో కాంగ్రెస్లో చేరతారని భావించారు.అయితే వివేక్ మాత్రం బీజేపీలో చేరి కాంగ్రెస్కు షాకిచ్చారు.ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి,జగ్గారెడ్డిలు కూడా బీజేపీలో చేరాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల చేరడం సాధ్యం కాలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు..