ఫ్లిప్‌కార్ట్‌ మెగా సేల్

  • In Money
  • July 25, 2019
  • 121 Views
ఫ్లిప్‌కార్ట్‌ మెగా సేల్

ఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గ్రాండ్ గాడ్జెట్ పేరుతో ఈ రోజు మరో భారీ అమ్మకాలను ప్రారంభించింది. ఈ నెల 27 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీల ల్యాప్‌టాప్‌లు, ఆడియో, గేమింగ్, కెమెరాలు, స్మార్ట్ హోం ఉత్పత్తులు, వేరబుల్స్, మొబైల్ యాక్సెసరీలు పవర్ బ్యాంకులు, డేటా స్టోరేజీలు, టాబ్లెట్లు, కంప్యూటర్ పెరిఫెరల్స్, ల్యాప్టాప్ యాక్సెసరీలు తదితర వాటిపై ఆఫర్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లపై కనీసం 25 శాతం, హెడ్‌ ఫోన్లు, స్పీకర్లపై 70 శాతం వరకు రాయితీలు అందిస్తోంది. పవర్ బ్యాంకుల కనీస ధర రూ.325 నుంచి ప్రారంభం కాగా, మొబైల్ యాక్సెసరీలు రూ.99 నుంచి అందుబాటులో ఉన్నాయి. లెనోవో ఐప్యాడ్ 330 సెవెంత్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, డాస్ ఓఎస్‌ను రూ.17,990కే అందుబాటులో ఉంచింది. లెనోవో ఐడియా ప్యాడ్ 130ని రూ.20,990కి లిస్ట్ చేసింది. ఏసర్ యాస్పైర్ 3ని రూ.14,990కి, హైఎండ్ ల్యాప్‌టాhd ఏసర్ స్విఫ్ట్ 7ని రూ.72,900కి అందుబాటులో ఉంచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos