చిత్తూరు : ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషి మహమ్మద్ రఫీకి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. గత నవంబర్ 6న బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. జిల్లాలో పోక్సో యాక్ట్ కింద తొలి ఉరిశిక్ష ఇదే. ఉరిశిక్ష తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని జడ్జి జస్టిస్ వెంకట హరనాథ్ తెలిపారు.