ముంబై : విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్వీ ను పాలక పక్షం – శివసేన పత్రిక –సామ్నా ఆకాశానికి ఎత్తేసింది. ‘దేవేంద్ర ఫడణ్వీస్ ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ధైర్యంగా, క్రియాశీలంగా వ్యవహరించారు. తను కరోనాకు గురయితూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటానని ఒక మంత్రితో చెప్పారు. దాన్ని ప్రశంసించటానికి బదులుగా కొందరు ఎగతాళి చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరైన వైఖరి కాదు. విపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లూ విజయవంతులయ్యారని పదే పదే చెబుతున్నాం. కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటాననటంలో రాజకీయ జిమ్మిక్కు ఎంత మాత్రమూ కాదు. ప్రభుత్వ వ్యవస్థపై ఆయనకున్న విశ్వాసమ’ని పేర్కొంది.