నన్ను వెలేసారు

హైదరాబాదు: లోక్సభలో తన ఆసనాన్ని వెనుక వరుసకు మార్చి నంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని వైకాపా అసంతృప్త లోక్సభ సభ్యుడు రఘు రామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. శనివారం విలేఖరులతో మాట్లాడారు. ‘నన్ను మరో మెట్టు ఎక్కించారను కుంటా. మా పార్టీ నన్ను వెలి వేసింది. అయినా నేను ఎన్నడూ ముఖ్యమంత్రి జగన్కు, పార్టీకి విధేయుడినేన’న్నారు.‘ భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో నేను పలు అంశాల గురించి చర్చించా. అవి ఏంటో ఇప్పుడు చెప్పలేను. రాష్ట్ర రాజకీయాల గురించీ కూడా చర్చల్ని జరిపాం. ఆంధ్రప్రదేశ్లో నాకు భద్రత లేదు. లాక్డౌన్ వల్ల నేను మూడు నెలల పాటు హైదరాబాద్లో ఉన్నా. అయినా నాపై కొందరు కేసులు పెట్టార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos