మొక్కలు నాటిన మాజీ మంత్రి

మొక్కలు నాటిన మాజీ మంత్రి

హోసూరు : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హోసూరు సమీపంలోని మాచినాయకనపల్లి వద్ద మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి మొక్కలు నాటి, పేదలకు నిత్యావసర సరుకులను పంచిపెట్టారు. మాచినాయకనపల్లి పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాచినాయకనపల్లి పంచాయతీలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోసూరు యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకటస్వామి ,ఏడిఎంకె పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, ఎ.ఎస్ ముధుగానపల్లి పంచాయతీ అధ్యక్షులు రమేష్, బాగలూరు పంచాయతీ ఉపాధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, ఏడిఎంకె నాయకుడు రమేష్ రెడ్డి, కిరణ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos