నేరగాళ్లకూ వోటేయండి

నేరగాళ్లకూ వోటేయండి

రాంచీ: వచ్చే శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భాజపా అభ్యర్థులు దివ్యాంగులైనా, నేరస్థులైనా, దొంగలైనా, బందిపోట్లైనా వారికే ఓటేయాలని భాజపా లోక్సభ సభ్యుడు నిషికాంత్ దుబే పిలుపు నిచ్చారు. ఇది జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘శాసనసభ ఎన్నికల్లో భాజపా అధిష్టానం ఎవరిని నిలబెట్టినా వారికే ఓటేయాలి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నిర్ణయాలపై నమ్మకం కలిగి ఉండాల’న్నారు. దూబే వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండి పడ్డారు. రాష్ట్రంలో మేట వేసిన నిరుద్యోగ, అవినీతి సమస్యల్ని ప్రస్తావించకుండా ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టినా వారినే గెలిపించాలనడాన్ని తప్పు బట్టారు. దీంతో దూబే దిద్దుబాటు చర్యలకు దిగారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. ఎన్నికల్లో అధిష్టానం మంచి వ్యక్తులనే నిలబెడుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos