బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే పోటీ నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకోగా శుక్రవారం తాజాగా దిగ్వి జయ్ సింగ్ కూడా బరి నుంచి తప్పు కున్నారు. మల్లి కార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం దీనికి కారణం. మధ్యాహ్నం 3 గంటలకు నామ పత్రాల దాఖలు ప్రక్రియ ముగియనుంది. ‘మల్లికార్జున ఖర్గే నాకు సీనియర్. నిన్న ఆయన నివాసానికి వెళ్లా. మీరు పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పా. తాను పోటీ పడటం లేద న్నారు. అయితే, అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూశా. అందుకే బరినుంచి తప్పుకున్నా. నేను ఖర్గేకు మద్దతుగా నిలుస్తా. ఆయనపై పోటీ చేసే ఆలోచనను కూడా చేయన’న్నారు. తన జీవితంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కే పని చేశానని, చివరి వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని దిగ్విజయ్ చెప్పారు. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం… ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos