ఆ దాడి సూత్రధారి అమిత్ షా

కోల్కతా: తన మేనల్లుడు, టీఎమ్సీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై ఇటీవల కొందరు కర్రలు, లాఠీలతో దాడి చేయటం వెనుక హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఇక్కడ ఆరోపించారు. ‘‘హోం మంత్రి క్రియాశీలక మద్దతు లేకుండా ఇటువంటి దాడులు జరిగి ఉండేవి కావు. త్రిపుర రాష్ట్ర పోలీసులు ఎదుటే ఈ దాడి జరిగింది. కానీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. ఇటువంటి దాడిని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదు’’ అని ఆరోపించారు. త్రిపురలో టీఎమ్సీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో అభిషేక్ బెనర్జీ ఇటీవల రాష్ట్ర రాజధానిలో టీఎంసీ నేతలను కలిసేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. పలువురు కార్యకర్తలూ గాయపడ్డారు.

తాజా సమాచారం