వచ్చే మార్చికి రోజుకు 2.8 లక్షల కరోనా కేసులు

వచ్చే  మార్చికి  రోజుకు 2.8 లక్షల కరోనా కేసులు

వాషింగ్టన్ : వచ్చే 2021 మార్చి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అధ్యయనంలో తేలింది. 18 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతారని అంచనా వేసింది. ఇదే వ్యవధిలో ఇండియాలో ఊహించని రీతిలో రోజుకు 2.8 లక్షల వరకు కేసులు దాఖల వుతాయని తెలిపింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇప్పుడు సంచలనాన్ని రేపుతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షల మందికి పైగా మరణించారు. మన దేశంలోకరోనా కేసుల సంఖ్య ఏడున్నర లక్షలను సమీపిస్తోంది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos