పరిషత్ ఎన్నికల్లో కారుజోరు..

పరిషత్ ఎన్నికల్లో కారుజోరు..

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ.జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం మొదలైంది . రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో 978 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కిస్తున్నారు.ఉదయం ఆరు గంటలకే బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించిన అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అనంతరం మండల పరిషత్‌ ఓట్లు చివరగా జిల్లా పరిషత్‌ ఓట్లు లెక్కించనున్నారు.మొత్తం 35,529 మంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు.మొత్తం 8 రౌండ్లలో లెక్కింపును ప్రక్రియను పూర్తి చేయనుండగా ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కించనున్నారు.ఇలా ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గత నెలలో 5,659 ఎంపీటీసీలు, 534 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది.వీటిలో 158 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఫలితాల అనంతరం ఈ నెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు,8వ తేదీన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైఎస్ ఛైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు జరపనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos