అమరావతి: ‘పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు వారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపు కున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్ర బాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూ రం గా ఉండి పోయింది. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకో లేదు’ అని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం ట్వీట్లో విమర్శించారు. ‘ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యు లేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టు కుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?’ అని ఎద్దేవా చేసారు.