చార్‌థామ్ యాత్రలో 201 మంది మృతి

చార్‌థామ్ యాత్రలో 201 మంది మృతి

డెహ్రాడూన్ : చార్థామ్ యాత్రలో గత 60 రోజుల్లో 201 మంది యాత్రికులు మరణించారు. కేదార్నాథ్ యాత్ర మార్గంలో 95 మంది, బద్రీనాథ్ ధామ్లో 51 మంది, గంగోత్రిలో 13 మంది, యమునోత్రిలో 42 మంది యాత్రికులు మరణించారని డెహ్రాడూన్లోని రాష్ట్ర అత్యవసర సేవల కేంద్రం తెలిపింది. ‘‘అనారోగ్యానికి గురయ్యే యాత్రికులకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో చికిత్స కోసం హెలి-అంబులెన్స్ ద్వారా ఉన్నత వైద్య కేంద్రాలకు తరలిస్తున్నాం. ఇప్పటి వరకు మరణానికి ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధు లే. హృద్రోగ యాత్రికులు ఇక పై ప్రయాణం చేయవద్దని చెపుతున్నాం’’అని వైద్యులు చెప్పారు. యాత్ర మార్గాల్లో 20 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos