‘మీ నిరసనను సీఎంకు నివేదిస్తా’

‘మీ నిరసనను సీఎంకు నివేదిస్తా’

నెల్లూరు: ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్, సి ఏ ఏ ల పై నిరసన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామని మంగళవారం ఇక్కడ తనను కలసిని జేఏసీ నాయకులకు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘నేను ఈ అంశాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరిగే ట ప్పుడు లేను. హైదరాబాదులో ఉన్నా. గత 60 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉన్నారు. ఇదే ఐక్య త, సోదరభావం కొనసాగాలన్న దే నా అభిమతం. ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ , సి ఏ ఏ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ ను ముఖ్యమంత్రికి చేర వేస్తా. జగన్మోహన్రెడ్డి దీనికి వ్యతిరేకతను తెలిపారు. అయినా మీ కోరిక మేరకు ఆయనకు మరొక్కసారి విషయాన్ని తెలియజేస్తాన’ని చెప్పారు. జేఏసీ నాయకులు మౌలానా ఇలియాస్, ఆసిఫ్, జాకీర్, ఫయాజ్, జియావుల్ హక్, షకీల్ తదితరులు ఆయ న్ను కలుసుకున్నవారిలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos