గుల్బర్గ : మూఢ నమ్మకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలో జరిగిన జరిగిన ఘటన ఇందు కు నిదర్శనం. అంగ వైకల్యం పోతుందనే నమ్మకంతో తాజ్సుల్తానాపూర్ గ్రామ ప్రజలు అంగవైకల్యంతో బాధపడుతున్న తమ చిన్నారులను మట్టిలో గొంతు వరకూ పూడ్చి పెట్టారు. చిన్నారులు ఏడుస్తున్నా పట్టించుకో లేదు. ఈ ఘోరం స్థానిక అధికారులకు తెలియడంతో వారు జోక్యం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనం ఇచ్చింది. ఉదయం 8.08 గంటలకు ప్రారంభమై 11.11 గంటలకు ముగిసింది.