అమరావతి:రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా15వ ఆర్థికసంఘం ఎదుట సమర్థంగా వాదన విన్పించాలని ముఖ్యమంత్రి జగన్ శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికార్లను ఆదేశించారు. ప్రత్యేక హోదా అవసరాన్ని అద్దం పట్టేలా ఆర్థిక స్థితి గతుల పత్రం ఉండాలని సూచించారు. సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా చూరాదని, బెల్ట్ షాపుల్ని సమూలంగా తొలగించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్టు షాపుల్ని నిర్మూలించాలని సూచించారు.