ఢిల్లీ : జమ్మూ-కాశ్మీర్ కున్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయటాన్ని సవాలు చేస్తూ న్యాయమూర్తి ఎంఎల్శర్మ దాఖలు చేసిన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సరైన సమయంలో విచారణ చేపడతామని తెలిపింది. 370 అధికరణను రద్దు చేసే ముసాయిదాను కేంద్ర హోం మంత్రి రాజ్య సభలో ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి అధికారిక రాజపత్రాన్ని విడుదల చేశారు. అదే రోజు ముసాయిదా రాజ్యసభ ఆమోదం పొందింది. మరుసటి రోజు లోక్ సభ ఆమోదమూ దానికి లభించింది. అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.