కొన్ని లక్షల మంది పోరాటం వల్ల స్వాతంత్ర్యం

కొన్ని లక్షల మంది పోరాటం వల్ల స్వాతంత్ర్యం

న్యూ ఢిల్లీ : గాంధీ, తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ ఫాఫ్ అన్నారు. నేతాజీని అదుపులో పెట్టలేనంటూ గాంధీ అనే వారని గుర్తు చేశారు. మరోవైపు గాంధీ అంటే తన తండ్రి నేతాజీకి అమితమైన అభిమానమని చెప్పారు. నేతాజీని మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలే బ్రిటీషర్లకు అప్పగించేందుకు ప్రయత్నించారన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నేతాజీలిద్దరూ హీరోలే. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరూ లేకపోయినా అది సాధ్యమయ్యేది కాదు. కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నట్టుగా.. కేవలం అహింసా విధానాల వల్లే స్వాతంత్ర్యం రాలేదు. నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చర్యలూ దేశ స్వాతంత్ర్యానికి కారణం. అలాగని నేతాజీ, ఐఎన్ఏ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మా తండ్రి తో సహా ఎందరికో గాంధీ స్ఫూర్తిగా నిలిచారు. కొన్ని లక్షల మంది పోరాటం, త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos