దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్మూలనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళం ప్రకటించడంతో పాటు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించి అన్ని చిత్రపరిశ్రమల హీరోలు,నటులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.అయితే హీరోయిన్లలో ఏ ఒక్కరూ ఇంతవరకు ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించినట్లు వార్తలు రాలేదు.ఈ తరుణంలో బహుభాష హీరోయిన్ ప్రణీత తన వంతు సహాయంగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, ఈ కష్ట కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని… తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదే అని తెలిపింది. ఎఫర్ట్స్ ఫర్ గుడ్, లాజికల్ ఇండియన్ సంస్థలతో కలిసి హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రణీత ఫౌండేషన్ 500 కుటుంబాలకు సాయం చేసేందుకు సన్నాహకాలు చేస్తోందని చెప్పింది.మిగిలిన హీరోయిన్లు ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రణీతను ఆదర్శంగా తీసుకొని విరాళాలు ప్రకటిస్తారేమో చూడాలి..