ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో న‌లుగురు ఆప్ నేత‌లు అరెస్టు

ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో న‌లుగురు ఆప్ నేత‌లు అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి ఆతిషి ఇవాళ మీడియాతో మాట్లాడారు. రానున్న రెండు నెలల్లో, లోక్సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంత మందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు. తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఆప్ కార్యకర్తలను బీజేపీ జైల్లో వేసినా, ప్రతి కార్యకర్త మళ్లీ పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. ఒక్కర్ని జైల్లో వేస్తే పది మంది పోరాడేందుకు పుట్టుకు వస్తారని ఆమె అన్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే తనను అరెస్టు చేయబోరని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos