మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ మంత్రి మరొకరికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్కు నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గెహ్లాట్ ప్రస్తుతం నజఫ్గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్ను రూపొందించిన ప్యానల్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్ వాడుకో వడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్ తరచూ ఫోన్ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos