ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం మంగళవారం లాభాలతో ప్రారంభ మయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 44 పాయింట్లు పెరిగి 40,401 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 11,831 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.76 వద్ద నమోదైంది. ఓఎన్జీసీ, హెచ్యూఎల్, ఐఓసీ, జీ ఎంటర్టైన్మెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్ని పొందాయి. యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల పాలయ్యాయి.