డెహ్రడూన్: భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోది గురువారం నాలుగు గంటల
పాటు డెహ్రడూన్లోని జోలీ గ్రాన్ విమానాశ్రయంలోనే
కాలాన్ని గడిపారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఆయన ఉదయం పర్యటన అనధికారికం కావడంతో స్వాగతం
పలికేందుకు రాష్ట్ర గవర్నర్ బేబే రాణి మౌర్య ,ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్
విమానాశ్రయానికి రాలేదు. రుద్రపూర్లోని ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రూ.3,400 కోట్లతో దేశంలోని
మొదటి సమగ్ర సహకార అభివృద్ధి పథకాన్ని ప్రారంభించేందుకు
ఆయన వచ్చారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడే అవకాశం ఉన్నట్లు
వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం.