23 కోట్లకు పైగా విద్యుత్‌ బిల్లు చూసి విస్తుపోయిన యుపి వాసి

23 కోట్లకు పైగా విద్యుత్‌ బిల్లు చూసి విస్తుపోయిన యుపి వాసి

   లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని అబ్దుల్‌ బసిత్‌ అనే వ్యక్తి తన ఇంటికి వచ్చిన విద్యుత్‌ బిల్లును చూసి విస్తుపోయాడు. తన ఇంటికి కేవలం 178 యూనిట్లు విద్యుత్‌ను వినియోగించగా, బిల్లు రశీదులో 2 కిలోవాట్లు వినియోగించినట్లు ఉంది. ఈ కిలో వాట్లకు 23 కోట్లకు పైగా చెల్లించాలని విద్యుత్‌ బిల్లును అధికారులు అందించారు. దీంతో అతడు ఈ సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడానికి విద్యుత్‌ కార్యాలయానికి పరుగులు తీశారు. 23, 67, 71, 524 రూపాయల బిల్లును చూసిన బసిత్‌ మాట్లాడుతూ తాను యుపి మొత్తం వినియోగించిన విద్యుత్‌కు బిల్లును పొందినట్లు అనిపిస్తోందని, తన జీవితాంతం సంపాదించిన ఈ బిల్లుకు కట్టలేననని అన్నారు. దీనిపై కార్యనిర్వాహక ఇంజనీర్‌ మాట్లాడుతూ బిల్లును సరిదిద్దుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని తెలిపారు. సాంకేతిక లోపం, ఇతరత్రా కారణాల వల్ల ఇలా జరుగుతాయని ఆయన తెలిపారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos