ప్రాణంగా ప్రేమించినవాడే తనను దూరం పెడుతుండడాన్ని
తట్టుకోలేక బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు
ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.పోలీసుల ఆదేశాలతో శనివారం రాత్రి ఝాన్సీ ప్రేమికుడు సూర్యతేజ
పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.సూర్యతేజను అన్ని కోణాల్లో విచారించిన
అనంతరం అతడు చెప్పిన సమాధానాలతో అనుమానమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు
నిర్ధారణకు వచ్చారు.ఝాన్సీ కాల్స్కు స్పందికపోవడం,సూర్యతేజకు ఇంట్లో వేరే
సంబంధాలు చూస్తుండడం ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు తెలుపుతున్నారు. మధు అనే అమ్మాయి ద్వారా ఝాన్సీ పరిచయం కాగా అది ప్రేమగా మారిందని పోలీసులు చెప్పారు. వేరే వ్యక్తులతో ఝాన్సీ ఎక్కువగా మాట్లాడుతుండేదని, ఇది ఇష్టం లేని సూర్యతేజ సీరియల్స్లో నటించడం ఆపేయాలని ఒత్తిడి తీసుకురాగా అప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సీరియల్స్లో నటించేందుకు ఝాన్సీ సిద్ధమైంది. దీంతో సూర్యతేజ ఆమెతో గొడవపడి ఆమె మొబైల్ నంబర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాడు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఫోన్ చేయగా దానికి అతడు స్పందించలేదు. వాట్సాప్ మెసేజ్లు పంపగా మొబైల్ నెట్ ఆఫ్ ఉండటంతో సూర్యతేజ వాటిని చూసుకోలేదు. నెట్ ఆన్ చేసుకునే లోపు ఝాన్సీ పంపిన మెసేజ్లను తనే డిలీట్ చేసేసిందని తెలిపారు.న్యాయనిపుణుల సలహా తీసుకుని అతనిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరోపణలుఅవాస్తవాలు:సూర్యతేజ
కాగా ఝాన్సీ కుటుంబ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ సూర్యతేజ
తెలిపాడు.తమకు రూ.10లక్షల విలువ చేసే బంగారం ఇచ్చిన మాట అవాస్తవమన్నారు.కొద్ది
కాలం క్రితం తమకు కొంత బంగారం ఇచ్చారని అయితే ఝాన్సీ తల్లితండ్రులు ఓ స్థలం కొనే
సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన రూ.2.50లక్షలతో పాటు అదనంగా మరో
రూ.2.50లక్షలు కలిపి మొత్తం రూ.5లక్షలు తానే ఇచ్చానన్నారు.అయితే తన పుట్టినరోజుకు
మాత్రం ఝాన్సీ రూ.1లక్ష విలువ చేసే ఆర్15 బైకు కొనిచ్చిందన్నారు.
మా ఇంట్లో తమ ప్రేమ విషయం తెలిసినప్పటికీ తన ఇంటికి వచ్చి వారం రోజులు ఉందన్నది వాస్తవం కాదన్నాడు. గొడవలు ఉన్నమాట వాస్తవమే కానీ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని సూర్య తెలిపినట్లు పోలీసులు తెలిపారు.