లోకేశ్‌ ఓ ఆంబోతు…

లోకేశ్‌ ఓ ఆంబోతు…

ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కుమారుడు లోకేశ్‌పై ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శులు
గుప్పించారు.సోమవారం కన్నా మీడియాతో మాట్లాడారుప. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకు
వదిలినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్రంపైకి వదిలేసారని ఆ ఆంబోతు దొరికిన చోటల్లా అడ్డంగా మేస్తూ రాష్ట్రాన్ని
దోచేస్తోందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు.రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి
ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర
ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు తన వైఖరిని బహిర్గతం
చేసుకున్నారన్నారు.తన స్వప్రయోజనాల కోసం,కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ విమర్శించారు. ఏపీ ప్రజల సొమ్ముని దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా చేస్తున్నారని తెలిపారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే ఒక్కడే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని తాము కట్టిస్తుంటే అది తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?.. కేంద్ర నిధులతో కట్టిన నిర్మాణాలను మేము చూపిస్తాం, రాష్ట్రం కట్టించిన ఒక్క ప్రాజెక్టునైనా మీరు చూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సంస్కారహీనుడు కాబేట్టే మోదీ భార్య గురించి మాట్లాడారని చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించాలన్న కనీస ప్రోటోకాల్‌ పాటించకుండా.. చంద్రబాబు ఆంధ్రుల పరువు నిలువునా తీశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పది లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, కాదంటే దీనిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారని వెల్లడించారు. కానీ చంద్రబాబు ముందుకు రాలేకపోయాడని, యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos